telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మా పార్టీ అధ్యక్షునికే పీఎం టూర్‌లో అవకాశం లేదు…

BJPpresident -K-Laxman

ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనపై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ స్పందించారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన పై వివాదమే లేదని.. రాజకీయ చర్చ కు ఆస్కారం ఇవ్వకూడదు అనే ప్రధాని ఎవరిని కలవడం లేదన్నారు. ప్రధాని టూర్ లో సీఎం పాల్గొనే విషయం ఆత్మగౌరవం అంశం ఎలా అవుతుంది!? Kcr ముఖ్యమంత్రి మాత్రమే కాదు… ఒక పార్టీ కి అధ్యక్షుడు కూడా! అని పేర్కొన్నారు లక్ష్మణ్‌. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రధాని పర్యటనకు వెళ్లడం లేదని… రాష్ట్ర బీజేపీ అధ్యక్షునితో సహా ఎవరికి ప్రధాని టూర్ లో అవకాశం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ పార్టీ మునుగుతుందని గ్రహించే… ఇప్పుడు ఆత్మగౌరవం అనే చర్చ మొదలు పెట్టారని తెలిపారు. గల్లీ ఎన్నికలు అనడం ద్వారా హైదరాబాద్ ప్రజలను కించపరుస్తున్నారని అన్నారు. ఇప్పుడు అమిత్ షా టూర్ తప్పు పడుతున్న కేసీఆర్‌…. వరదల్లో ఒక్క రోజు కూడా హైదరాబాద్ లో ఎందుకు తిరగలేదని ప్రశ్నించారు.

Related posts