telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్!

AP ration cards

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్‌ను ప్రభుత్వం రద్దును చేయనుంది . దివ్యాంగులకు, వ్యాధిగ్రస్తుల పింఛన్లకు మినహాయింపు ఇచ్చింది.

ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పురపాలక కమిషనర్ లేదా ఎంపీడీవోలకు పంపించింది. ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పింఛను రద్దు చేయనున్నారు. పరిశీలన బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది.

Related posts