ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం తగ్గాయి. అయితే… బులియన్ మార్కెట్లో వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లోనూ బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా నమోదు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,590 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ.73,800 వద్ద కొనసాగుతోంది.