కేంద్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపు ప్రధాని మోదీ మార్కు పాలనకు నిదర్శనమని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో కొత్త క్యాబినెట్ సభ్యుల పదవీప్రమాణస్వీకార కార్యక్రమానికి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో దేశాన్ని ముందుకు నడిపేలా కేబినెట్ ఉందని ప్రశంసించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారని హెచ్చరించారు. 4 సీట్లు గెలిచినందుకు కేంద్రమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు తెచ్చామన్నారు. 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేయబోయేది బీజేపీయేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా ఫలితాలు చూసి టీఆర్ఎస్ నాయకుల్లో కలవరం మొదలైందని వ్యాఖ్యానించారు.