telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయడం కోసమే కొరత: టీడీపీ ఎంపీ నాని

kesineni-nani

ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయడంకోసమే రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారని టీడీపీ ఎంపీ కేశినేని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక కొరతతో భవన నిర్మాణరంగ కార్మికులు పనిలేక కష్టాలు పడుతున్నారని అన్నారు. సీఎం జగన్ కుటుంబ సంపద పెంచుకునేందుకు రాష్ట్రాన్నిఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయలేరని వ్యాఖ్యానించారు. విజయవాడలో ప్రజావేదిక కూల్చకుండా ఉంటే కోట్ల రూపాయలు ఆదా అయ్యేవని పేర్కొన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలపడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. జగన్ పాలన తుగ్లక్ పరిపాలనను తలపిస్తోందని కేశినేని విమర్శించారు.

Related posts