telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ తండ్రి కన్నుమూత…

హైదరాబాద్ క్రికెటర్, భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌ తండ్రి మహ్మద్ గౌజ్‌ మృతి చెందారు. ఆయన వయసు 53. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మహ్మద్ గౌజ్‌ శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఐపీఎల్‌లో సత్తాచాటి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిరాజ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బయోబబుల్‌లో ఉండటంతో అతడు అంత్యక్రియలకు దూరం కానున్నాడు. కాగా, పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్‌ భారత క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి కీలకపాత్ర పోషించాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్‌ కలను ప్రోత్సహించాడు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు రూ.2.6 కోట్లకు సొంతం చేసుకోవడంతో సిరాజ్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇటీవల బెంగళూరు తరఫున సిరాజ్‌ సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.‌ ఆ ప్రదర్శన కారణంగానే కరోనా తర్వాత భారత్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆసీస్ పర్యటనకు ఎంపిక అయ్యాడు.

Related posts