telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ట్రస్టుల వ్యవహారాల్లో జోక్యం ఆపేయాలి: చంద్రబాబు

chandrababu

ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఆపేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేరళలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలన హక్కులను ట్రావెన్ కోర్ రాజ కుటుంబ వారసులకే అప్పగిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ తీర్పు ఏపీలో వైసీపీ సర్కారుకు కనువిప్పు కావాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ట్రస్టులను నిర్వహించే రాజకుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తున్న సంప్రదాయాలను సుప్రీం కోర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొన్నారు. తమ రాక్షస ఉద్దేశాలను నెరవేర్చుకునే క్రమంలో సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఆపేయాలని అన్నారు. ఈ ట్రస్టు సంరక్షులుగా గజపతి కుటుంబీకుల హక్కులను తప్పనిసరిగా రక్షించాలని ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts