telugu navyamedia
సినిమా వార్తలు

నెటిజన్లకు సారీ చెప్పిన సాయి పల్లవి

Sai-Pallavi

ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “ఎన్.జి.కే” చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటించగా… రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలో కన్పించారు. ఈ సినిమా విడుదలకి ముందు నెటిజన్లతో చిట్ చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవాలని సాయిపల్లవి భావించింది. అందుకు టైమ్ ను కూడా ఫిక్స్ చేసి అభిమానులకు తెలియజేసింది. కానీ కొన్ని కారణాల వలన ఆమె అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దాంతో నిరాశకి లోనైన నెటిజన్లు సాయిపల్లవి తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. “మా సమయం వృథా చేసుకుని నీతో చాటింగుకి వెయిట్ చేస్తుంటే నువ్వు చీటింగ్ చేస్తావా?” అంటూ విరుచుకుపడ్డారు. దాంతో సాయిపల్లవి నెటిజన్లకు “సారీ” చెప్పేసింది. “మరోసారి ఎప్పుడైనా సోషల్ మీడియాలో కలుద్దాం” అంటూ అభిమానుల అలక తీర్చేసింది.

Related posts