లతామంగేష్కర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని, కోలుకుంటున్నారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. ఉషా మంగేష్కర్ మీడియాతో మాట్లాడుతూ… లతామంగేష్కర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జవుతారని స్పష్టం చేశారు. వైరల్ ఇన్ ఫెక్షన్ కారణంగా శ్వాస సంబంధ సమస్య రావడంతో లతామంగేష్కర్ ఇవాళ ఉదయం 2 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. లతామంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆమెను పరామర్శించారు.
next post