చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్ కు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీలోని కడపకు చెందిన మహేశ్తో వ్యాపార లావాదేవీలు కలిగిన బండ్ల గణేశ్.. 2014లో మహేశ్ కు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఈ మొత్తానికి సంబంధించి మూడు చెక్కులను బండ్ల గణేశ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు చెందిన ఈ చెక్కులను 2017లో కడపలోని హెచ్డీఎఫ్ బ్యాంకులో మహేశ్ వేశారు. అప్పటికే ఈ చెక్కులను స్టాప్ పేమెంట్ చేయించిన గణేశ్… మహేశ్కు డబ్బులు ఇవ్వలేదు. దీంతో కడపలో చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. బండ్ల గణేశ్ తరుపు న్యాయవాదులు కేసు వేసిన వారితో రాజీ కుదుర్చుకున్నారు. బాకీ పడిన సొమ్ములో రూ.4 లక్షలు ను చెల్లించిన బండ్ల గణేష్..మిగతా మొత్తాన్ని వచ్చే 14వ తేదీన చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత దీనిపై విచారణ జరిపిన కడప కోర్టు బండ్ల గణేష్ని నవంబర్ 4 వరకు రిమాండ్లో ఉంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
previous post
next post