telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : … మల్టీప్లెక్స్ థియేటర్ లో .. క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం..

2019 world cup live in multiplex

క్రికెట్ అభిమానులకు భేషైన వార్త. దేశంలోనే రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ అయిన ఐనాక్స్‌ థియేటర్లలో భారత జట్టు ఆడే ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం దక్కనుంది. ఇందుకోసం ఐనాక్స్ లీజర్-ఐసీసీ చేతులు కలిపాయి. ప్రపంచకప్‌లో భారత్ ఆడే 9 మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి మొత్తంగా 15 కీలక మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐసీసీతో ఐనాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

దేశంలోని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణె, జూపూర్, ఇండోర్, వడోదర, సూరత్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని ఐనాక్స్ థియేటర్లలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐనాక్స్‌లోని భారీ తెరలపై మ్యాచ్‌లను వీక్షించడం ద్వారా నేరుగా స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూసే అనుభూతి లభిస్తుందని ఐనాక్స్ లీజర్ సీఈవో అలోక్ టాండన్ పేర్కొన్నారు.

Related posts