తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ఉండకూడదని భావించిన రోజే కేసీఆర్ పతనం మొదలైందని చెప్పారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయనకు మళ్లీ పరాభవం ఎదురుకానుందని జోస్యం చెప్పారు.
రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, అప్పులపాలు చేయడం వంటి ఘనతలు కేసీఆర్ కుటుంబానికే చెందుతాయని దుయ్యబట్టారు. కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోమని తెలిపారు. ఇంటర్ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బీచ్ లలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.