టాలీవుడ్ కోలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ అయిన నయనతార, విఘ్నేశ్ శివన్ ఇపుడు ఈ జంట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. నయనతార, విఘ్నేశ్ కలిసి చట్టపట్టాలేసుకు తీరుగుతున్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రియల్ లైఫ్లో, రీల్ లైఫ్ లో ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా మంది సెలబ్రిటీలు తమను ఫాలో అయ్యేలా చేసుకుంటున్నారు. ఇక వీరిద్దరూ ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాత్రం ఇప్పటి వరకు నయన్ స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివాన్ తో కలిసి నయన్ గోవాకు వెళ్లిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా వీరు తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే విఘ్నేష్ పుట్టినరోజును దగ్గరుండి జరిపిన నయన్ అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు ఇప్పుడు కోలీవుడ్లో టాక్ నడిచింది. ఇన్నాళ్లు చట్టపట్టాలేసుకు తిరిగిన ఈ ప్రేమ పక్షులు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లికి వీరు రెడీ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి కోసం ప్రస్తుతం చెన్నై సమీపంలోని ఒక ఫామ్ హౌస్ రెడీ అవుతుందని అంటున్నారు. విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఈ పెళ్లి ఏర్పాటు చేస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని వారాల్లోనే వీరి పెళ్లి ఉంటుందని.. అతి తక్కువ మంది జనాల ఆధ్వర్యంలో ఈ పెళ్లి వేడుక నిరాడంబరంగా సాగబోతుందని సినీ వర్గాల వారిలో కూడా టాక్ వినిపిస్తుంది.
పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ