telugu navyamedia
సినిమా వార్తలు

ఆ ఛానెల్స్‌పై స‌మంత కేసు..

టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ జంట‌ల్లో నాగ చైత‌న్య‌, స‌మంత ఒక‌రు. 2010లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఎన్నో ఆశ‌ల‌తో 2017లో అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశ‌ల‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ఈ జంట నాలుగేళ్ళు కూడా నిండ‌కుండానే విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Samantha is the next guest on Evaru Meelo Koteeswarulu, her first  appearance after separation - Movies News

తర్వాత నుంచి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వెల్లువెత్తాయి. సమంత పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్‌ జుకల్కర్‌, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల నెగటివ్ వార్తలు సమంతపై పలు యూట్యూబ్ ఛానళ్లు సమంతపై నెగటివ్ ప్రచారం చేశాయి.

దీంతో స‌హానం కొల్పోయిన స‌మంత‌ హైదరాబాద్​ కూకట్​పల్లి కోర్టు లో మూడు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం కేసు నమోదు చేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీలతో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పైన సమంత పిల్ దాఖలు చేశారు. కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై సమంత పరువునష్టం కేసు వేశారు.

Up Close And Personal With 'The Family Man' Star Samantha Akkineni |  Femina.in

కాగా..తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును సమంత కోరారు. తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు సమంత.

Related posts