మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని `నకిలీ`తో హీరోగా మారాడు. తర్వాత `డా.సలీమ్`, `బిచ్చగాడు`, `యమన్`, `భేతాళుడు`, `ఇంద్రసేన`, `రోషగాడు` వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 5న “కిల్లర్”గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ ఆంటోని. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా తన సినిమాలకు సంగీత బాధ్యతలను నిర్వహించే ఈయన “కిల్లర్” సినిమాకు మాత్రం సంగీతం అందించలేదట. అందుకు కారణం మంచి స్క్రిప్ట్స్ను ఎంచుకోవడంతో పాటు నటనపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట విజయ్ ఆంటోని. అందుకని రెండు, మూడేళ్ల వరకు సంగీత దర్శకత్వం వహించనని విజయ్ ఆంటోని తెలిపారు. “కిల్లర్” చిత్రానికి సైమన్స్ సంగీతాన్ని అందించాడు.
ణ్ విజయ్ తో కలిసి ‘జ్వాల’ అనే ద్విభాషా చిత్రంతో పాటు, ఆనంద్, సెంథిల్ అనే ఇద్దరు కొత్త దర్శకులతో కలిసి సినిమాలు చేయబోతున్నట్లు చెప్పారు. ఇవి కాకుండా మరో పది సినిమాలు అంగీకరించినట్లు సమాచారం. ఇవన్నీ మూడు, నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అన్నారు. ఇంతకముందు తన సొంత బ్యానర్ లోనే సినిమా చేశానని, ఇప్పుడు బయట నిర్మాతలతో ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్నట్లు చెప్పారు.