బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్. అయితే ఈ సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. షో ఆరవ వారం వీకెండ్ వచ్చేసింది. ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుంటుంది. బిగ్ బాస్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఈ వారం ఎలిమినేషన్లో మహేష్ విట్టా లేదా హిమజ ఉంటారని భావిస్తున్నారు. అయితే ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ చేసి ఎలిమినేషన్ చేస్తూ వచ్చిన నాగార్జున ఈవారం తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. ఈ కారణంగా బిగ్బాస్-3లో ఈవారం హోస్ట్ గా రమ్యకృష్ణ రాబోతోందని వార్తలు కూడా విన్పిస్తున్నాయి. హోస్ట్ విషయంలో క్లారిటీ రావాలన్నా, ఈ ముగ్గురులో ఎవరు ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతారో తేలియాలన్నా శని, ఆదివారం ఎపిసోడ్ లు చూడాల్సిందే.
previous post
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు