telugu navyamedia
సినిమా వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ -హరీష్‌ శంకర్‌ మూవీ అప్డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్‌ హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా హరీశ్‌ శంకర్‌, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌లు పవన్‌ను కలిశారు. సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌, ఇతర వివరాలను ఆయనకు తెలియజేశారు. హరీశ్‌ శంకర్‌ టీమ్‌ వర్క్‌పై పవన్‌ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పవన్‌ 28వ చిత్రంగా తెరకెక్కతుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.


కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోనున్నాయి. వీలైనంత త్వరగా ‘భీమ్లా నాయక్‌’ పూర్తి చేసి, ‘హరిహర వీరమల్లు’తో పాటు హరీశ్‌ శంకర్‌ సినిమా కోసం డేట్స్‌ కేటాయించాలని పవన్‌ చూస్తున్నారు. అయాంక్‌ బోస్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా ప్రచార చిత్రం అభిమానులలో అంచనాలను, ఉత్సుకతను పెంచేసింది. ఈ నేపథ్యంలో షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోందన్న సమాచారం మరింత ఆనందాన్ని మెగాభిమానులకు కలిగిస్తోంది. ఈ చిత్రానికి అయాంక బోస్ కెమెరామేన్ గా వ్యవహరించనున్నారు. ఆనంద సాయి ఆర్ట్ డైరక్షన్ చేస్తుంటే ఫైట్స్ ను రామ్ లక్ష్మణ్ అందించనున్నారు.

Related posts