అల్లు అర్జున్ తో సరసన ‘డీజే’, ఎన్టీఆర్తో ‘అరవింద సమేత’, మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో, తాజాగా బన్ని సరసన ‘అలా వైకుంఠపురంలో’ నటించి వరుస హిట్లతో జోష్ మీద ఉన్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తుంది. నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలతో నటించడంతో టాప్ పొజిషన్లో ఉంది. టాప్ హీరోయిన్ రేసులో ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్లో ఆమె నటిస్తుండగా… ఆ చిత్ర ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజ్ అవ్వగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఇప్పటికి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 11 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇది నిజంగానే రేర్ ఫీట్. ఈ ఆనందంలోనే పూజా అలా తన కాళ్ళను యోగా భంగిమలో పైకి ఎత్తి వాటిని 11గా చూపించింది. ఇప్పుడు యోగ భంగిమలోనే తన ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు చెప్పింది పూజా. పూజ హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.
అలాంటి నిర్మాతలు నా దగ్గరకు రావొద్దు… త్రివిక్రమ్ ను నేనే హైదరాబాద్ తీసుకొచ్చా.. : సునీల్