యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమాని, కృష్ణా జిల్లా ఎన్టీయార్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మరణం పట్ల ఎన్టీయార్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీరనిదని, కెరీర్ మొదట్నుంచి ఆయన తనకు అండగా ఉన్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎన్టీయార్ ఓ లేఖ విడుదల చేశారు. “నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. `నిన్ను చూడాలని`తో మొదలైన మా ప్రయాణం ఇలా అర్థంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. నటుడిగా నేను చూసిన ఎత్తుపల్లాల్లో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్ చాలా ముఖ్యమైనవారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ఎన్టీయార్ ఈ లేఖలో పేర్కొన్నారు.
previous post
next post
సమంత ‘కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..’