ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా “సాహో” బాగానే కలెక్షన్స్ను రాబడుతోంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అభిమానులని కూడా పెద్దగా అలరించలేకపోయిందనే టాక్ నడుస్తుంది. అయితే వసూళ్ల పరంగా తొలిరోజున “సాహో” రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం కాపీ వివాదాల మధ్య చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ లిసా రే “సాహో”పై సంచలన ఆరోపణలు చేశారు. ఈమె `సాహో`పై కాపీ రైట్ ఆరోపణలు చేస్తున్నారు. “బేబీ వోన్ట్ యు టెల్మీ…” అనే పాటలో ఆర్ట్ వర్క్ను “సాహో” యూనిట్ షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ నుండి కాపీ కొట్టారని లిసా రే ఆరోపిస్తున్నారు. సాహో సాంగ్ పోస్టర్ను, ఒరిజినల్ పోస్టర్ను లీసారే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చర్చిద్దామా? : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు