telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు: మౌనదీక్ష అనంతరం కన్నా

kanna bjp mouna deeksha

జగన్ రాష్ట్ర ప్రజలకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.అమరావతిని రాజధానిగా కొసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్ధండరాయునిపాలెంలో కన్నా చేపట్టిన మౌనదీక్ష ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు.

ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు. ఇలాంటి రాక్షస పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.అమరావతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను కల్పించిందని, కానీ, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రియలెస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతం మొత్తాన్ని అమ్మేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ అభిప్రాయాలను తీసుకోకముందే ఈరోజు కేబినెట్ మీటింగ్ పెట్టారని విమర్శించారు.

Related posts