రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సహారా ఎస్టేట్లోని గాంధార అపార్ట్మెంట్లో నివసించే ఎడ్ల శంకరయ్య (39) సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. 2011లో ఓ మహిళను పెళ్లాడి అనంతరం ఆమెను వదిలిపెట్టాడు.
అనంతరం 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగానే గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.