కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా స్పందించారు. నిన్న డిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ ‘భారత్ మాతాకీ జై’ అన్న నినాదాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాతంత్య్ర పోరాట సమయంలో వందేమాతరాన్ని పాడితే నేరంగా భావించేవారని, ఇప్పుడు ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని తప్పుబడుతున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఈ నినాదాన్ని నేరంగా పరిగణించడం బాధాకరమని ప్రధాని అన్నారు. ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇలా అనడం మరింత దురదృష్టకరమన్నారు.
రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది: కోదండరెడ్డి