ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను కూడా సభ ముందుకు తేనున్నారు.
ఈ నేపథ్యంలో రేపు అన్ని శాఖ అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ కానున్నారు. సమావేశాలకు అన్ని ఏర్పాట్లును చేయాలని వారికి సూచించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలంతా బడ్జెట్లో కేటాయింపుల పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.