telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది: కోదండరెడ్డి

kodanda reddy

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి తప్పు పట్టారు. అసెంబ్లీలో మొదటి రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుతో పార్టీ గ్రాఫ్ పెరిగిందనన్నారు. మూడో రోజు వచ్చి రేవంత్ మాట్లాడిన మాటలతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అన్నారు.

శాసనసభలో ఎప్పుడు ఏం మాట్లాడాలనేది ఎమ్మెల్యేలే నిర్ణయించుకుంటారని చెప్పారు. యురేనియం అంశంలో ఏఐసీసీకి వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే నివేదిక ఇచ్చారని తెలిపారు. సంపత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై చర్చించామన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. యురేనియం అంశంపై జనసేన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం తప్పేనని అభిప్రాయపడ్డారు.

Related posts