ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఒక సామాజికవర్గానికే సీఎం ప్రాధాన్యతను ఇస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కుల వివక్షను చూసి పారిశ్రామికవేత్తలు కూడా పారిపోతున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అరాచకంతో ఓ మహిళా అధికారిణి రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలను సమర్పించాల్సి ఉందని… కానీ, జగన్ మాత్రం సాంప్రదాయాలన్నీ పక్కన పెట్టి ఒక్క రోజు ముందే వస్త్రాలను సమర్పించారని మండిపడ్డారు.గతంలో చంద్రబాబు కార్యాలయంలో పని చేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వడం లేదని, రిలీవ్ చేయకుండా వివక్ష చూపుతున్నారని ఉమా విమర్శించారు.