telugu navyamedia
క్రీడలు వార్తలు

నిన్ను చూస్తుంటే గర్వాంగా ఉంది సిరాజ్ : సచిన్

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ అభిమానుల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే సిరాజ్ తన సహచరుడి సెంచరీ తనదే అన్నట్లుగా సిరాజ్ సెలెబ్రేట్ చేసుకోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సిరాజ్ క్రీజులోకి వచ్చే సమయానికి అశ్విన్ 80 పరుగుల వద్ద ఉన్నాడు. దాంతో అతని సెంచరీ అసాధ్యమేనని అంతా భావించారు. కానీ సిరాజ్ 15 బంతులను డిఫెన్స్ చేసి తన సహచరుడి సెంచరీకి సాయం చేశాడు. అశ్విన్ సెంచరీ పూర్తవ్వగానే తన సెంచరీ పూర్తయినట్లు ఆనదించాడు సిరాజ్. ఇక తాజాగా ఈ విషయం పై భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్పందించాడు. తన ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ ” అశ్విన్ సెంచరీ తర్వాత సిరాజ్ చేసిన పని చాలా ఆసక్తికరంగా ఉంది. నేను దానిని పూర్తిగా ఆనందించాను. టీమ్ స్పోర్ట్ అంటే ఇదే …. మీ సహచరుల విజయంలో భాగం కావడం చాలా ఉత్తమం. సిరాజ్ నిన్ను అలాగే భారత జట్టును చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అని సచిన్ ట్విట్ చేసాడు.

Related posts