telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పట్టాలపై చిన్నారి..మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి సాహసం

ప్రమాదం ఏ సమయంలో జరుగుతుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మహా రాష్ట్ర లో జరిగింది. మహా రాష్ట్రలో ఊ రైల్వే ఉద్యోగి ఎవరు చేయని సాహసం చేశాడు. రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళుతున్నారు. అంతలోనే అదుపుతప్పి ఆ చిన్నారి రైలు పట్టాలపై పడ్డాడు. ఆ సమయంలోనే అటు నుంచి పట్టాలపై రైలు వేగంగా వస్తుంది. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి ఏ మాత్రం ఆలోచించకుండా.. చిన్నారి వైపు పరుగుపెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వస్తోంది. రెప్పపాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి పట్టాలపై నుంచి ఫ్లాట్ ఫామ్ పైకి పడేసి.. తాను కూడా పైకి ఎక్కాడు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ముంబై డివిజన్ లోని వంగాని రైల్వే స్టేషన్ లోని రెండో ఫ్లాట్ ఫామ్ పై జరిగింది. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు రైల్వే ఉద్యోగులు కూడా అతన్ని అభినందించారు.

Related posts