telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీకి ప్రచారానికి వెళ్లి.. బాధితురాలిగా మిగిలిపోయింది.. సాంతం దోచేశారు..

bjp campaigner house attacked

ఎన్నికల వేళ అని ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ అభ్యర్థి ఇల్లు దోపిడీకి గురైంది. ఈ దోపిడీకి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులే పాల్పడ్డారని అభ్యర్థి ఆరోపిస్తున్నారు. కోల్‌కతాలోని హుగ్లీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బందేల్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడ మే 5న పోలింగ్ జరగనుంది. కొందరు వ్యక్తులు కొద్ది రోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతుండటాన్ని తాను గమనించానని, నిన్న వారిని గట్టిగా నిలదీయడంతో పాటు ఫోటోలు తీయిస్తానని బెదిరించడంతో వారు పారిపోయారని తెలిపారు.

ఈ రోజు ఉదయం తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని, ఈ దాడిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, సామగ్రి ధ్వంసమయ్యాయని ఛటర్జీ తెలిపారు. ఇది టీఎంసీ పనేనని ఆమె ఆరోపించారు. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఎంసీపై నింలు మోపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని టీఎంసీ హుగ్లీ జిల్లా నేత తపన్ దాస్ గుప్తా పేర్కొన్నారు. అసలు ఛటర్జీకి టికెట్ కేటాయించడం ఆ పార్టీలోని కొందరికి నచ్చలేదని, దీంతో తన ఇంటిపై దాడి జరిగిందని ఆమె చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఛటర్జీ తెలిపారు.

Related posts