సల్మాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్ల చేత ఘోరమైన టాస్క్లు చేయిస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ హౌస్లో ఓ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో భాగంగా సిద్ధార్థ్ డే అనే కంటెస్టెంట్పై మిగతా హౌస్మేట్స్ ఏకంగా కిలో బ్లీచ్ పౌడర్ చల్లారట. అంతటితో ఆగలేదు అరకిలో కారం పొడి తెచ్చి అతనిపై పోశారట. దాంతో అతని మెడ వద్ద చర్మం ఊడిపోయింది. గత వారం ఈ షో నుంచి బయటికి వచ్చేసిన సిద్ధార్థ్ మీడియా ముందుకు వచ్చి తన గోడును చెప్పుకున్నాడు. “బిగ్ బాస్ హౌస్లో టాస్క్లో భాగంగా నాపై బ్లీచ్, కారం పొడి చల్లారు. నా శరీరంపై చర్మం ఊడిపోయింది. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. ఈ టాస్క్ వల్ల చాలా రోజుల పాటు నిద్రపోలేకపోయాను. సెలబ్రిటీలు అయివుండి ఇలాంటి పనులు చేస్తే యువతకు రాంగ్ మెసేజ్ ఇచ్చినవారవుతారు. తొలి టాస్క్లోనే నాచేత మట్టి, మిరపకాయలు తినిపించారు. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నా తోటి కంటెస్టెంట్స్తో నేను అలా చేయలేదు. ఎందుకంటే టాస్క్ కోసం నేను మరొకరిని హింసపెట్టే వ్యక్తిని కాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే పనులు చేయొచ్చు కానీ కారం పొడి, బ్లీచ్ చల్లితే అది ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుందో నాకు అర్థంకావడంలేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు సిద్ధార్థ్. దాంతో నెటిజన్లు సల్మాన్ ఖాన్పై, బిగ్ బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్కు అయిన గాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. సల్మాన్ మాత్రం ఈ ఘటన గురించి ఇంతవరకు స్పందించింది లేదు.
previous post