telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భైంసాలో రెచ్చిపోయిన అల్లరి మూకలు..విధుల్లో ఉన్న పోలీసులపై దాడి!

Bhainsa Nirmal dist

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ముషారా, ఎస్పీ శశిధరరాజు, అధికారులు వార్డుల్లో పర్యటించారు.

ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్నారు. దీంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో వారిలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Related posts