లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ముషారా, ఎస్పీ శశిధరరాజు, అధికారులు వార్డుల్లో పర్యటించారు.
ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్నారు. దీంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో వారిలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మోదీతో గొడవవద్దని చంద్రబాబుకు చెప్పాను.. వినిపించుకోలేదు: అంబికా కృష్ణ