telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలి: సీఎం జగన్ 

డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణా చర్యలపై ఈ రోజు జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సనార్భంగా కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేయొద్దని, పరీక్షలు నిర్వహించే సంఖ్యను క్రమంగా పెంచాలని సూచించారు.

క్యాన్సర్, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అత్యవరసర సేవల కోసం ‘104’ కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని అన్నారు. క్యాన్సర్, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు.

నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, ఇప్పటివరకు మొత్తం 48,034 పరీక్షలు చేశామని జగన్ కు అధికారులు తెలిపారు. కొరియా నుంచి తెప్పించిన కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని, నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ర్యాపిడ్ టెస్టు కిట్లతో ఇప్పటి వరకూ 14,423 పరీక్షలు చేశామని చెప్పారు.

Related posts