లాక్డౌన్ కారణంగా ఉద్యోగుల జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ సింగరేణి యాజమాన్యం తమ ఉద్యోగుల విషయంలో ఇదే నిర్ణయం అమలు చేయాలని భావిస్తోంది. మార్చినెల వేతనంలో సగం మాత్రమే చెల్లించాలని, మిగిలింది తర్వాత చెల్లించాలని నిర్ణయించింది.
అయితే ఈ నెలలో పదవీ విరమణ చేసిన కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించింది. కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాని నిర్ణయించింది. ఇప్పటికే పండగ అడ్వాన్స్, సహకార సొసైటీ లోన్ రికవరీ, క్లబ్బు రికవరీలను వాయిదా వేశారు. సింగరేణిలో సుమారు 43 వేల మంది ఉద్యోగులు ఉండగా వీరిలో 27 వేల మందికి మార్చి నెలలో సగం జీతం అందుకున్నా సరే 15 వేల రూపాయలకు పైగానే వస్తుంది. కానీ, మిగిలిన సుమారు 13,600 మందిలో 15 వేల కన్నా తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఉన్నారు. వీరిని పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యం కనీస వేతనం 15వేలు చెల్లించనుంది.
నేనేమీ టీడీపీకి ద్రోహం చేయలేదు: అంబికా కృష్ణ