telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మళ్ళీ జట్టులోకి వచ్చిన కోహ్లీ…

కరోనా లాక్ డౌన్ తర్వాత భారత జట్టు మొదటిసారిగా వెళ్లిన ఆసీస్ పర్యటన నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీ20, టెస్ట్ సిరీస్ ను మాత్రం సొంతం చేసుకుంది. అయితే భారత జట్టు తిరిగి వచ్చిన తర్వాత వచ్చే నెల నుండి ఇంగ్లాండ్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ లో తలపడనుంది. అందులో మొదటగా నాలుగు టెస్ట్ ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆసీస్ పర్యటనలో గాయం కారణంగా తప్పుకున్న షమీ, ఉమేష్, జడేజా, విహరిలు ఈ రెండు టెస్ట్ లకు ఎంపిక కాలేదు. అలాగే ఎవరు ఊహించ విధంగా భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ జట్టులో స్థానం దకించుకున్నాడు. అలాగే ఆసీస్ లో చివరి మూడు టెస్ట్ లు ఆడని కెప్టెన్ కోహ్లీ తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చాడు. అలాగే అసైన్ పర్యటనలో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు సుందర్,శార్దుల్ కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టును మీరు కూడా చుడండి.

టీం ఇండియా : విరాట్ కోహ్లీ (c), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, షుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే (vc), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (wk), వృద్దిమాన్ సాహా (wk), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, శార్దుల్ ఠాకూర్ 

Related posts