బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశంలోని ముస్లిం సోదరులకుప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ఈద్ అల్ అద్హా పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పర్వదినం మన సమాజానికి శాంతిని, మరింత ఆనందాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ట్వీట్ చేశారు. ఈ పర్వదినం భక్తికి, విశ్వాసానికి, త్యాగానికి సంకేతం. సోదరభావం, కరుణ, ఐక్యతకు ఈద్ అల్ అద్హా పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందని వెంకయ్య ట్వీట్లో పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…