telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్పొరేట్ ఆసుపత్రులతో సర్కారు కుమ్మక్కయింది: బండి సంజయ్

BJP Bandi sanjay

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. కార్పొరేట్ ఆసుపత్రులతో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కయ్యిందని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేసిన ఒకట్రెండ్ ఆసుపత్రులను సీజ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.

గణేశ్ ఉత్సవాల్లో కరోనా పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కానీ రంజాన్ సమయంలో కరోనా కేసులు తగ్గించి చూపించారని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts