telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టీ20 సిరీస్ ను… కైవసం చేసుకున్న ఆసీస్ ..

australia got t20 series on srilanka

ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టీ 20ల్లోనూ శ్రీలంక ఓడిపోయింది. గత ఆదివారం అదిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కంగారూల చేతిలో ఏకంగా 134 పరుగుల తేడాతో ఓడిన లంకేయులు బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లోనూ నిరాశపరిచారు. దీంతో మూడు టీ20ల సరిస్‌ని ఒక మ్యాచ్‌ ఉండగానే 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా ఆఖరి టీ20 మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరగనుంది.

రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు పేలవంగా 19 ఓవర్లలోనే 117 పరుగులకి అలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టాన్‌లేక్‌, పాట్‌ కమిన్స్‌, అస్టన్‌ అస్గర్‌, ఆడమ్‌ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా .కుశాల్‌ మెండిస్‌, సందకన్‌ రనౌటయ్యారు. కెప్టెన్‌ లసిత్‌ మలింగ, హసనరంగ స్పిన్నర్‌ ఆడమ్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యారు.

Related posts