telugu navyamedia
రాజకీయ వార్తలు

క‌శ్మీర్ లో వేలాది స్కూళ్ల‌ను మూసివేశారు: కిష‌న్‌రెడ్డి

Kishan Reddy

క‌శ్మీర్ లోయ‌లో వేలాది స్కూళ్ల‌ను మూసివేశార‌ని హోంశాఖ స‌హాయ మంత్రి జి.కిష‌న్‌రెడ్డి తెలిపారు. బెంగుళూరులో జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ క‌శ్మీర్‌లో సుమారు 50 వేల ఆల‌యాల‌ను మూసివేశార‌ని పేర్కొన్నారు. వాటిని తెరిపించేందుకు త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

క‌శ్మీర్ లోయ‌లో మూత‌ప‌డ్డ స్కూళ్ల సంఖ్య‌ను తెలుసుకునేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ధ్వంస‌మైన ఆల‌యాల వివ‌రాల‌ను కూడా సేక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. మూత‌ప‌డ్డ ఆల‌యాల స‌మాచారాన్ని తెలుసుకునేందుకు స‌ర్వేకు ఆదేశించిన‌ట్లు మంత్రి చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన నేపథ్యంలో క‌శ్మీర్ లోయ‌లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

 

Related posts