telugu navyamedia
క్రైమ్ వార్తలు

అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం : కోడ‌లి త‌ల న‌రికి పోలీస్ స్టేష‌న్ తీసుకెళ్ళిన అత్త‌ సుబ్బ‌మ్మ‌

*అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం..
*కోడ‌లి త‌ల న‌రికిన అత్త సుబ్బ‌మ్మ‌
*కోడ‌లి త‌ల‌ను న‌రికి పోలీస్ స్టేష‌న్ తీసుకెళ్ళిన అత్త‌ సుబ్బ‌మ్మ‌
*త‌ల‌ను చూసి షాకైన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారణం చోటుచేసుకుంది. అత్త తన కోడలిని అతికిరాతకంగా హత్య చేసి.. కోడలి తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే

రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో సుబ్బమ్మ అనే మహిళ తన కోడలు వసుంధరను నరికి చంపింది. అనంతరం కోడలి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే సుబ్బమ్మ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది

Related posts