తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం హైదరాబాద్ తార్నాకలో బీభత్సం సృష్టించింది.
డ్రైవర్ బస్సును అదుపు చేయలేక.. ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో.. మూడు కార్లు, ఓ బైక్ ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్ పారిపోయారు. జేబీఎస్ నుంచి జనగామ వెళుతుండగా హబ్సీగూడ సిగ్నల్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి