telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి

CLP Batti vikramarka fire KCR KTR

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని భట్టి అన్నారు. 15 శాతం నిర్మాణం కూడా పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభిస్తున్నారని విమర్శించారు. 15 శాతం నిర్మాణానికే రూ. 50 వేల కోట్లు ఖర్చయితే, పూర్తి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని ప్రశ్నించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతం పూర్తైన ప్రాజెక్టులకు అడ్డుపడి, తెలంగాణకు గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చేసిందేమీ లేదన్నారు. ఎలాంటి త్యాగం చేయని ఆయనను కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు.

Related posts