telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు: పేర్ని నాని

perni Nani ycp

ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఈ రోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

అనంతరం మంత్రి పెర్ని నాని  మీడియాతో మాట్లాడారు. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వంపై ఇప్పటివరకు రూ.8,300 కోట్ల పైచిలుకు భారం పడిందని వివరించారు.రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 

రాబోయే రోజుల్లో కొత్త  రైతులు వస్తుంటారని, కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అందుకే ఈ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కు ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. తద్వారా ఒక యూనిట్ కు రూ.2.50 లోపే పడుతుందని చెప్పారు.

Related posts