బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్” ఇటీవల కాలంలో దక్షిణాదిన బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో మూడవ సీజన్ నడుస్తోంది. అయితే గతంలో ప్రసారమైన సీజన్లలో ఈ షోను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా ఈ రియాలిటీ షో ప్రసారంపై స్టే విధించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ వేసింది తెలుగు బిగ్ బాస్ పై కాదు తమిళ “బిగ్ బాస్”పై. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ఈ నెల 23 నుండి విజయ్ టీవీలో తమిళ “బిగ్ బాస్-3” ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంతో పాటు దాన్ని నిర్వహిస్తున్న విజయ్ ఛానెల్పై మద్రాస్ హైకోర్టులో న్యాయవాది సుదన్ పిటిషన్ వేశారు. కార్యక్రమంలో పాల్గొనే సభ్యులు అశ్లీలంగా దుస్తులు వేసుకుంటున్నారని, డబుల్ మీనింగ్ పదాలతో మాట్లాడుతున్నారని, ఇవన్నీ పిల్లలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ షోను ప్రసారం చేయడానికి ముందు సెన్సార్ బోర్డుతో కార్యక్రమాన్ని చెకప్ చేయాలని పిటిషన్లో తెలిపారు. మరి ఈ షో కోర్టు స్టే విధిస్తుందా ? లేదా ? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం