telugu navyamedia
రాజకీయ

బస్సులో కోట్ల డబ్బు.. ఏపీ సరిహద్దులలో పట్టుకున్న అధికారులు.. !

employee offering money to his lead
రాబోవు ఎన్నికల కు ఇప్పటి నుండో భారీగా నగదు తరలింపు ప్రారంభం అయ్యింది. తాజాగా, హైదరాబాద్‌ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న రూ. 1.53 కోట్ల డబ్బు ఏపీ సరిహద్దుల్లో అధికారులకు పట్టుబడింది. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి చెందిన తిరువళ్లూరు, కాంచీపురం అధికారులు, గుమ్మిడిపూండి చెక్‌ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, ఓ ప్రైవేటు బస్సులో ఉన్న రెండు సూట్ కేసుల్లో నోట్ల కట్టలు కనిపించాయి. 
వీటిని బస్సులోనే ఉన్న హైదరాబాద్ కు చెందిన నీరజ్ గుప్తా అనే వ్యక్తివని గుర్తించిన అధికారులు, ఆయన్ను అదుపులోకి తీసుకుని డబ్బును లెక్కించారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ డబ్బు ఎవరైనా పొలిటికల్ లీడర్ కు అందించేందుకు తరలిస్తున్నారా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

Related posts