telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జర్నలిస్టులకు బీమా చేయించాలి: నారా లోకేశ్

Nara Lokesh

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అనేకమంది జర్నలిస్టులు మృతి చెందడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరి నియోజకవర్గంలోని 62 మంది జర్నలిస్టులకు లోకేశ్ ఉచిత బీమా సౌకర్యం ప్రకటించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల మేర లబ్ది పొందేలా బీమా కల్పించారు.

కరోనా మరణాలకు కూడా బీమా వర్తింపజేసేలా తీసుకువచ్చిన ఈ పాలసీలకు ప్రీమియంను నారా లోకేశ్ చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా చేయించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు.

Related posts