తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వింర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు, కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందనిఅన్నారు. ఆరోగ్య శాఖ మాత్రమే ఈటల దగ్గర ఉంది..పవర్ అంతా సీఎం దగ్గరే ఉందన్నారు. ఈటల కేవలం కరోనా కేసుల బులిటెన్ విడుదలకే పరిమితం అయ్యారని చెప్పారు.
హైకోర్టు అంటే కూడా ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి కాదు, కరోనా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తన పార్టీ అధికారంలో ఉంటే ఆరోగ్య మంత్రిని సంగారెడ్డి ఆసుపత్రిలో పడుకో బెట్టే వాడినన్నారు. తాను తిట్టింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కానీ..ఆయన కులాన్ని కాదన్నారు. శ్రీనివాస్ గౌడ్ చిట్టా చాలా ఉందని జగ్గారెడ్డి అన్నారు.