హైద్రాబాద్ నగరవాసుల కల సాకారమైంది. మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ (కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటే: కేఏ పాల్