telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న చెన్నై…

ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చెన్నై జట్టు పేవర్ దీపక్ చాహర్ పంజాబ్ జట్టు ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ రాహుల్ రన్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ పంజాబ్ జట్టు యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ 47 పరుగులు కారణంగా ఆ జట్టు 100 పరుగులను దాటింది. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఇక 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై చేధనను నెమ్మదిగా ఆరంభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ స్పీడ్ పెంచాడు. క్రమంగా బంతులను బౌండరీలు దాటిస్తూ జట్టును లక్ష్యానికి దగ్గర చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత విజయానికి 8 పరుగులే అవసరం అనే సమయంలో రైనా, రాయుడు వరుస బంతుల్లో వెనుదిరిగిన ఓపెనర్ డు ప్లెసిస్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి జట్టుకు 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయాన్ని చెన్నై తమ ఖాతాలో వేసుకుంది.

Related posts