సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ గత ఏడాదిసంక్రాంతి కానుకగా విడుదలై ఏనీత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అయితే ఈ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో దొంగల గ్యాంగ్ లీడర్ గా నటించి వినోదం పండించాడు నటుడు బండ్ల గణేశ్. అయితే.. ఆ సినిమాలోని పాత్రకు లభించిన ఆదరణ పట్ల పెద్దంత సంతృప్తి చెందని గణేశ్ నటుడిగా మరే సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించడానికి పథక రచన చేస్తున్న బండ్ల గణేశ్ కు తాజాగా దర్శకుడు మారుతీ ఓ పాత్రను ఆఫర్ చేశాడని తెలుస్తోంది. యువీ క్రియేషన్స్, జి.ఎ.2 సంస్థలు సంయుక్తంగా గోపీచంద్ – మారుతీ కాంబినేషన్లో ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి ప్రాధమికంగా ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ మూవీలో గణేశ్ తో ఓ ప్రధాన పాత్రను మారుతీ చేయించబోతున్నాడట. నిజానికి గతంలో ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలోనే ఓ పాత్రను మారుతీ… గణేశ్కు ఆఫర్ చేసినా… అప్పట్లో అతను నిరాకరించినట్టు తెలిసింది. ఇప్పుడు మాత్రం ఈ ‘పక్కా కమర్షియల్’ మూవీలోని పాత్రకు గణేశ్ పచ్చ జెండా ఊపాడని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమాలో బండ్ల పాత్ర ఎలా ఉంటుంది అనేది.
previous post
next post