telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. కొత్తగా 65,002 మందికి పాజిటివ్

Corona

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 65,002 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో 996 మంది మృతి చెందారని తెలిపింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 25,26,193కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 49,036 కి పెరిగింది. ఇక 6,68,220 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,08,937 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు మొత్తం 2,85,63,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

Related posts